రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) జిల్లా కేంద్రంలోని సమ్మికృత జిల్లా సముదాయం కలెక్టరేట్ కార్యాలయంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జోగినపల్లి భాస్కరరావు( Joginapally Bhaskara Rao) 7000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులు పట్టుబడ్డారు, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ సుమారుగా నాలుగున్నర లక్షలతో నిర్మించిన స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం నాలుగు నెలలుగా తిప్పుతూ, చీప్ ప్లానింగ్ అధికారికి పంపించడం కోసం 8 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు.
దీనితో వెంకటేష్ ఏసీబీ ని ఆశ్రయించినట్లు ఏసీబీ డిఎస్పి వివి రమణమూర్తి తెలిపారు, అనంతరం ఏసీబీ అధికారులు పథకం ప్రకారం వల వేయడంతో సోమవారం 7000 రూపాయలు నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్యాండ్ గా భాస్కర్ రావును పట్టుకున్నారు భాస్కర్ రావును అరెస్టు చేసి కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు డి.
ఎస్.పి తెలిపారు అవినీతి అధికారులతో పీడించబడుతున్న బాధితులు ఏసీబీ డిఎస్పి 9154388954,సర్కిల్ ఇన్స్పెక్టర్లు9154388955,9154388596,నెంబర్లను సంప్రదించాలని ఈ సందర్భంగా డి.ఎస్.పి రమణమూర్తి సూచించారు.