కృష్ణా జిల్లా తిరువూరులో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల( AP PCC Chief Sharmila ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో బీజేపీ రాజ్యమేలుతోందని వైఎస్ షర్మిల ఆరోపించారు.రాష్ట్రంలో బీజేపీ( BJP )కి ఒక్క సీటు లేకున్నా రాష్ట్రాన్ని బీజేపీ శాసిస్తోందని విమర్శించారు.
చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్( Chandrababu,Jagan,Pawan Kalyan ) ముగ్గురూ బీజేపీకి బానిసలని పేర్కొన్నారు.వీరిలో ఎవరికీ ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని తెలిపారు.
ఈ క్రమంలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.