ఏపీలోని టీడీపీ నేతలపై సీఈవో ఎంకే మీనాకు వైసీపీ ఫిర్యాదు చేసింది.ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీడీపీ నేతలపై వైసీపీ లీడర్లు ఈసీకి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బాలకృష్ణ,( Balakrishna ) లోకేశ్ పై( Nara Lokesh ) ఈసీకి ఫిర్యాదు చేసినట్లు వైసీపీ నాయకుడు మల్లాది విష్ణు( Malladi Vishnu ) తెలిపారు.
బాలకృష్ణ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు.
సీఎం ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా బాలకృష్ణ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు.ఈ క్రమంలోనే ప్రభుత్వంపై ఎన్ఆర్ఐలు దుష్ప్రచారం చేయడం తగదని స్పష్టం చేశారు.