ఎన్నికల్లో గెలిపిస్తే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తా: బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్

నల్లగొండ జిల్లా: పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం కోసం కృషి చేస్తానని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఓటర్లను అభ్యర్థించారు.మంగళవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని చెర్లగూడ ప్రాజెక్టును సందర్శించారు.

 If We Win The Election, We Will Complete The Project Work Bjp Candidate Boora Na-TeluguStop.com

నర్సిరెడ్డిగూడెం భూ నిర్వాసితులను కలుసుకొని పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందిందాని అడిగి తెలుసుకున్నారు.భూములు కోల్పోయిన నిర్వాసితులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందక రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత డబ్బులు ఇచ్చి ఆదుకుంటానని చెప్పిన హామీని గుర్తు చేశారు.తర్వాత చండూరు మండల కేంద్రానికి చేరుకొని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

బంగారిగడ్డ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.గతంలో ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి నవరత్నాల అభివృద్ధి తీసుకువచ్చానని,ఆదరించి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తానన్నారు.దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తుందని ఈ ఎన్నికల్లో 400 పైగా సీట్లు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి, మర్రిగూడ మండల పార్టీ అధ్యక్షుడు రాజేందర్ నాయక్,పందుల రాములు,దాసరి మల్లేశం, అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షం గౌడ్,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube