ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ( TDP ) విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ కీలక నేత నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) రేపటి నుంచి ప్రచారం చేపట్టేందుకు సమాయత్తం అయ్యారు.
ఈ నేపథ్యంలో ‘స్వర్ణాంధ్ర సాకార’ యాత్ర( ‘Swarnadhra Sakara’ Yatra ) పేరుతో ఆయన ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు.కదిరి నియోజకవర్గం నుంచి నందమూరి బాలకృష్ణ ప్రచారం ప్రారంభం కానుండగా…కూటమి అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో విస్తృతంగా పర్యటించనున్నారు.
అదేవిధంగా ఈ నెల 19వ తేదీన బాలయ్య హిందూపురం అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.అనంతరం ఈ నెల 25 నుంచి బాలయ్య ఉత్తరాంధ్రలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.