కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Kishan Reddy ) తీవ్రంగా మండిపడ్డారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ కొత్త నాటకానికి తెరలేపాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మాటలతో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల మధ్య దోస్తీ బయటపడిందని తెలిపారు.
మతాన్ని అడ్డు పెట్టుకుని ఎంఐఎం( MIM ) రాజకీయం చేస్తోందని ఆరోపించారు.
ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.మజ్లిస్ వ్యతిరేక ఓటు చీల్చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయన్న కిషన్ రెడ్డి ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతారని తీవ్ర ఆరోపణలు చేశారు.