ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 17 సీజన్( IPL 17 Season ) మ్యాచులు బాగానే సాగుతున్నాయి అన్నట్లు కనబడుతోంది.కాకపోతే ఆర్సిబి, ముంబై జట్ల పరిస్థితి మాత్రమే కాస్త భిన్నంగా కనబడుతోంది.
ఇకపోతే ప్రస్తుతం ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంజెన్సీ టెక్నాలజీ వినియోగం ఏ రేంజ్ లో ఉపయోగంలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఈ ఆర్టిఫికెట్స్ ఉపయోగించి ఎన్నో రకాల పెద్ద పెద్ద పనులను కూడా చిటికెలో ఇట్లే పూర్తి చేయడం జరుగుతుంది.
ఇకపోతే తాజాగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి రాబోయే 20 ఏళ్లలో ఏ టీం ఐపీఎల్ చాంపియన్షిప్ గెలుస్తుందా అని ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్లాట్ఫామ్ ( Artificial intelligence )అంచనా వేసింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబితా గమనించినట్లయితే.2024 లో జరుగుతున్న ఐపీఎల్ సీజన్ నో గుజరాత్ టైటాన్స్ ( Gujarat Titans )విజేతగా నిలుస్తుందని తెలిపింది.ఇక మనసిటి ఏడాది చెన్నై సూపర్ కింగ్స్, ఆ మరుసటి సీజన్ 2026 లో ముంబై ఇండియన్స్ టైటిల్ దక్కించుకోబోతున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తెలియజేసింది.ఇక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2027 లో అలాగే 2036 లో టైటిలు దక్కించబోతున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది.
ఇక ఇప్పటివరకు ఒక టైటిల్ కూడా గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన కల నెరవేరాలంటే మరో ఐదేళ్లు వేసి చూడాల్సి ఉందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంచనా వేస్తుంది.2029లో ఆర్సిబి జట్టు విజేతగా నిలుస్తుందని, అలాగే తిరిగి 2038లో టైటిల్ కైవసం చేసుకోబోతున్నట్లు అంచనా వేసింది.ఇక అలాగే 2028లో పంజాబ్ జట్టు, 2030లో ఢిల్లీ క్యాపిటల్స్, 2033లో లక్నో మొదటిసారిగా ఐపిఎల్ ఛాంపియన్ నిలబడపోతున్నట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలిపింది.దీన్ని బట్టి చూస్తే.
రాబోయే 20 సంవత్సరాలలో 10 జట్లు రెండుసార్లు టైటిల్ దక్కించుకునే అవకాశాలు కనబడుతున్నాయి.ఇది కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇచ్చింది కాబట్టి అది ఎంతవరకు నిజమో అన్న విషయం సందేహమే.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.