జయశంకర్ భూపాలపల్లి జిల్లా( Jayashankar Bhupalpalle District ) మహదేవ్ పూర్ మండలంలో గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్( Medigadda Barrage ) మరింతగా కుంగింది.ఈ మేరకు బ్యారేజ్ 20వ పిల్లర్ సుమారు ఐదు ఫీట్లకు పైగా కుంగిపోయిందని తెలుస్తోంది.
బ్యారేజ్ బే ఏరియాతో పాటు క్రస్ట్ స్పిల్ వేలోనూ పగుళ్లు మరింత పెరుగుతున్నాయని సమాచారం.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ( National Dam Safety Authority ) నిపుణుల బృందం పర్యటించి కుంగిన బ్యారేజ్ ప్రాంతాన్ని పరిశీలించిన సంగతి తెలిసిందే.
అయితే గతంలో బ్యారేజ్ వద్ద భారీ శబ్ధం వచ్చి ఏడవ బ్లాక్ లోని 20 వ పిల్లర్ వద్ద పగుళ్లు ఏర్పడిన సంగతి తెలిసిందే.