రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం మేడిపల్లి మండలం మాచపూర్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి విగ్రహ పున ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( Aadi Srinivas ) పాల్గొన్నారు.ప్రభుత్వ విప్ కు భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాలు, పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు.
స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామి వారి దివ్య ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు.అనంతరం వేద పండితులు ఎమ్మెల్యే ఆశీర్వచనాలు అందించారు
.