సినిమా వారికి ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ అని ఇప్పటికే కొన్ని వందల సార్లు చెప్పుకున్నాం.అందులో నిజం లేకపోలేదు కానీ అందరూ అలా ఉండరు అని చెప్పడానికి కూడా కొన్ని ఉదాహరణలు ఉంటాయి.
ప్రేమించిన వాడితో జీవితం పంచుకోవడానికి ఆరాటపడే కొంతమంది హీరోయిన్స్ కొన్నాళ్ల తర్వాత వారితో వేగలేక విడాకులు తీసుకున్నప్పటికీ మరొకరిని పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఒంటరిగానే ఉండటం కూడా భర్త పై ప్రేమపై ఉన్న ఇష్టం లేదా అభిమానం కారణం కావచ్చు.ఇంకా కొంతమంది హీరోయిన్స్ అయితే విడాకులు తీసుకున్న తర్వాత భర్త చనిపోయిన కూడా మరో వివాహం చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తున్నారు.
మరి అలా ఒంటరి లైఫ్ లీడ్ చేస్తున్న ఆ హీరోయిన్స్ ఎవరు అనే విషయాన్ని ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఇటీవల కాలంలో హీరోయిన్ మీనా( Meena ) భర్త విద్యాసాగర్( Vidya Sagar ) మరణించిన విషయం మనందరికీ తెలిసిందే.అయితే మీనా అతడితో విడాకులు తీసుకోలేదు కానీ చివరి నిముషం వరకు వీరు విడిగానే ఉన్నారు.చనిపోయినా కూడా మీనా తన భార్య ధర్మాన్ని నెరవేర్చించింది.
అలాగే ప్రస్తుతం సింగిల్ గానే ఉంటుంది.మరో పెళ్లి ఆలోచన లేదని కూడా స్పష్టం చేస్తుంది.

ఇక తాజాగా హీరోయిన్ కళ్యాణి( Kalyani ) భర్త సూర్య కిరణ్( Surya Kiran ) కూడా మరణించాడు.వీళ్లు గతంలోనే విడాకులు తీసుకుని విడివిడిగానే ఉన్నారు.అయినా కూడా విడిగానే ఉన్న మరొకరిని పెళ్లి చేసుకోకుండా ఉండటం విశేషం.పైగా సూర్యకిరణ్ మరణించిన తర్వాత కూడా ఆమె వ్యక్తిగత జీవితంలోకి మరొక వ్యక్తికి ఛాన్స్ లేదు అని చెబుతోంది కళ్యాణి.

గతంలో నటి రోహిణి( Actress Rohini ) సైతం రఘువరన్( Raghuvaran ) అనే విలన్ నటుడిని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకుంది.కానీ వీరు కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.అయినా కుమారున్నీ పెంచుకుంటూ రోహిణి విడిగానే ఉంది.ఆ తర్వాత రఘువరన్ మరణిస్తే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ప్రస్తుతం సింగిల్ గానే ఉంటుంది రోహిణి.ఇక భానుప్రియ( Bhanupriya ) భర్తను కూడా కొన్నాల క్రితం గుండె పోటుతో కోల్పోయింది.అంతకన్నా ముందే వారిద్దరు విడాకులు తీసుకున్నారు.
అమెరికాకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న భానుప్రియ కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.కానీ భర్త మరణాన్ని మాత్రం ఆమె తట్టుకోలేకపోయింది.
ప్రస్తుతం సింగిల్ గానే ఉంటుంది.







