ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Dehi Liquor Scam Case )పై ఉత్కంఠ నెలకొంది.ఈ కేసులో అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Delhi CM Arvind Kejriwal ) ను ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనుంది.
ఆరు రోజుల కస్టడీ నేటితో ముగియనున్న నేపథ్యంలో న్యాయస్థానంలో ఆయనను ఈడీ ప్రవేశపెట్టనుంది.అయితే లిక్కర్ స్కాం డబ్బు సమాచారంతో పాటు ఆధారాలను ఇవాళ కేజ్రీవాల్ స్వయంగా న్యాయస్థానంలో వెల్లడిస్తారని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్( Sunita Kejriwal ) చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court )లో ఏం చెబుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.కాగా ఈ నెల 21న లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.