Anaparthi TDP : తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ నిరసన

తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ క్యాడర్( Anaparthi TDP Cadre ) నిరసనకు దిగారు.

నియోజకవర్గ సీటును నల్లమిల్లికి కేటాయించకపోవడంతో కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

ఈ క్రమంలో పార్టీ క్యాడర్ కొంచెం సమయం వేచి ఉండాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి( Nallamilli Ramakrishna Reddy ) విజ్ఞప్తి చేశారు.సీటు వ్యవహారంపై పార్టీ అధిష్టానంతో చర్చించేంత వరకు ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయొద్దని క్యాడర్ కు విన్నవించారు.

నల్లమిల్లికి సీటు ఇవ్వని పక్షంలో తాము మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని టీడీపీ నేతలు( TDP Leaders ) స్పష్టం చేస్తున్నారు.నల్లమిల్లికి సీటు ఇవ్వకపోతే నియోజకవర్గంలో వైసీపీ( YCP ) గెలుపు ఖాయమని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే అంతిమ నిర్ణయాన్ని నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే కార్యకర్తలు వదిలేశారని తెలుస్తోంది.అయితే పొత్తుల్లో భాగంగా అనపర్తి నియోజకవర్గ సీటును బీజేపీకి( BJP ) కేటాయించిన సంగతి తెలిసిందే.

Advertisement
గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత

తాజా వార్తలు