ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాలే( Arvind Kejriwal ) కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు.జైలు నుంచి సీఎంగా పని చేయొద్దని ఏ రాజ్యాంగంలో లేదన్నారు.
ఈ క్రమంలోనే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని జైలు నుంచే నడుపుతారని చెబుతున్నారు.అంతేకాదు కేజ్రీవాల్ ప్రజలు ఏం చెబితే అదే చేస్తారని స్పష్టం చేశారు.

కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.కేజ్రీవాల్ అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్న ఆప్ నేతలు దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.







