ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) మరోసారి ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు.ఈ మేరకు మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు ఆయనకు తొమ్మిదోసారి నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ నెల 17న కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది.

కాగా ప్రస్తుతం ఈడీ సమన్లపై కేజ్రీవాల్ న్యాయ పోరాటం చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఈడీ జారీ చేస్తున్న నోటీసులు చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ అంటున్నారు.ఇది కోర్టు పరిధిలోని అంశమంటూ విచారణకు కేజ్రీవాల్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.







