Minister Ambati Rambabu : ప్రజాగళంలో మైకు మూగబోవడం ఓటమే..: మంత్రి అంబటి

టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సభ అట్టర్ ఫ్లాప్ అని మంత్రి అంబటి రాంబాబు( Minister Ambati Rambabu ) అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) హాజరైన సభనే సరిగా నిర్వహించలేకపోయారని పేర్కొన్నారు.

2014 లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఎంత ఆగం చేశారో అందరికీ తెలుసని చెప్పారు.ప్రజాగళంలో( Praja Galam ) మైకు మూగబోవడం ఓటమేనని పేర్కొన్నారు.

మైకును సరి చేసుకోలేని వాళ్లు రాష్ట్రాన్ని ఎలా నడపగలరని ప్రశ్నించారు.

ప్రజాగళం సభలో కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయన్న అంబటి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా జగన్ ను( Jagan ) ఓడించలేరని స్పష్టం చేశారు.ప్రజాగళం సభ తరువాత చంద్రబాబులో( Chandrababu ) అభద్రతా భావం ఏర్పడిందన్నారు.అసలు చంద్రబాబు రాజకీయ జీవితం అంతా అభద్రతా భావమేనని తెలిపారు.

Advertisement

సభ దగ్గర భద్రతా వైఫల్యమంటూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.అయితే ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన ప్రజల గుండెల్లో ఉన్నది జగనేనని తెలిపారు.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు