ఎన్నికల ప్రచారంలో ఏపీలోని వైసీపీ( YCP ) దూకుడు పెంచింది.ఈ మేరకు ఈ నెల 27వ తేదీ నుంచి సీఎం జగన్( CM Jagan ) బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
‘ మేమంతా సిద్ధం’ పేరుతో నిర్వహించనున్న బస్సు యాత్ర షెడ్యూల్ ను వైసీపీ పెద్దలు ఇవాళ విడుదల చేయనున్నారు.ఇప్పటికే మొదటి నాలుగు రోజుల షెడ్యూల్ ను అధిష్టానం సిద్ధం చేసింది.
వైఎస్ఆర్ జిల్లా( YSR District )లోని ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర సుమారు 21 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కొనసాగనుంది.ఇందులో భాగంగా 21 బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు.ఇటీవల సిద్ధం సభలు జరిగిన జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో బస్సు యాత్రలు జరగనున్నాయి.పగలు వివిధ వర్గాల ప్రజలతో ముఖాముఖీలు నిర్వహించనున్న సీఎం జగన్ సాయంత్రం బహిరంగ సభలకు హాజరుకానున్నారు.
అనంతరం రాత్రుళ్లు ఆయా పార్లమెంట్ పరిధిలోనే జగన్ బస చేయనున్నారు.
.