బీజేపీ ఎంపీ లక్ష్మణ్( MP Laxman ) కీలక వ్యాఖ్యలు చేశారు.మాటలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) ను మించిపోయారని విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము కూలగొట్టమని తెలిపారు.అలాగే ఎవరైనా కూలగొడితే తాము కాపాడమని తేల్చి చెప్పారు.
గేట్లు తెరిచానంటున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోకుండా చూసుకోవాలని సూచించారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.