ఏపీలో టీడీపీ (TDP), జనసేన (Janasena) మరియు బీజేపీ (BJP) పార్టీలు పొత్తు (Allinace) లో ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మూడు పార్టీలు ఒకే వేదికపై నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి.
ఈ మేరకు పల్నాడు జిల్లా (Palnadu District) చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ‘ప్రజాగళం’ (Prajagalam) పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నాయి.ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు( Chandra Babu), జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో పాటు ప్రధాని మోదీ( Prime Minister Modi) హాజరుకానున్నారు.
ఇప్పటికే ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా పొత్తు ఖరారు అయిన తరువాత మూడు పార్టీలు (Three Parties) కలిసి సంయుక్తంగా తొలిసారి సభను నిర్వహిస్తున్నారు.కాగా సుమారు మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఉండగా.
ఈ సభకు పది లక్షల మంది వరకు వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.