బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) కేసుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ కవిత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పిటిషన్ ను జస్టిస్ బేటా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్( Justice Pankaj Mittal ) ధర్మాసనం విచారించనుంది.సీఆర్పీసీ నిబంధనల ప్రకారం( CRPC Rules ) విచారణ జరపడం లేదని కవిత ఆరోపించారు.
మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
తనపై ఎలాంటి బలవంతపు చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్ లో కోరారు.
కాగా ఏడాది కాలంగా కవిత కేసు సుప్రీంకోర్టు( Supreme Courtt )లో పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండటంతో ఈడీ, సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత గైర్హాజరు అవుతున్నారు.
ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల ముందు కవిత హాజరుపై రేపు సుప్రీంకోర్టులో విచారణతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.







