తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం( Fatal road accident in Tamil Nadu ) జరిగింది.ప్రైవేట్ బస్ ఫుట్ బోర్డు మీద ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.
చెన్నై – తిరుచిరాపల్లి ( Chennai – Tiruchirappalli )హైవేపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.ముందు వెళ్తున్న కంటైనర్ లారీని బస్సు అధిగమించే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
ఈ క్రమంలో బస్సులో నుంచి నలుగురు విద్యార్థులు కిందపడ్డారు.పడిపోయిన విద్యార్థుల మీద నుంచి కంటైనర్ లారీ చక్రాలు వెళ్లడంతో నలుగురు మృతిచెందారు.
ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







