తెలంగాణ కేబినెట్ సమావేశం( Telangana cabinet meeting ) ఇవాళ జరగనుంది.ఈ మేరకు సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అధ్యక్షతన మంత్రులు అంతా భేటీ కానున్నారు.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.కాగా ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించనున్నారని తెలుస్తోంది.
దాంతోపాటు ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీల అమలుపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారని సమాచారం.రైతుబంధు( Rythu Bandhu ) పేరును రైతు భరోసాగా మార్చడంతో పాటు లబ్ధిదారుల ఎంపిక నిబంధనలపైనా చర్చించనున్నారు.
అలాగే మహిళలకు వడ్డీలేని రుణ పథకం ప్రారంభంపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.ఇందులో భాగంగా హైదరాబాద్ లో భారీ మహిళా సదస్సును ప్రభుత్వం నిర్వహించనుంది.







