డిఫ్యూటీ సీఎం భట్టి, మహిళా మంత్రి కొండాకు గుట్టలో అవమానం

యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభ వేడుకలకు సోమవారం హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి,కొండా సురేఖ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆలయ అధికారులు ఘోర అవమానానికి గురిచేశారు.

 Humiliation To Deputy Cm Bhatti Vikramarka Minister Konda Surekha At Yadagirigut-TeluguStop.com

సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు ఉత్తమ్,కోమటిరెడ్డి లను పెద్ద పీటలో కూర్చోబెట్టి ఆశీర్వచనం చేసిన ఆలయ అర్చకులు,భట్టి,కొండా సురేఖ లను నేలపై కూర్చోబెట్టారు.ప్రోటోకాల్ ప్రకారం సిఎం డిఫ్యూటీ సీఎం,దేవాదాయ శాఖ మంత్రి,ఆ తర్వాత ఇతర మంత్రులకు అవకాశం ఉంటుంది.

కానీ,ఆలయ అధికారులు డిఫ్యూటీ సీఎం,ఆ శాఖా మహిళా మంత్రిని కింద కూర్చోబెట్టి,మిగతా మంత్రులకు పీటలు వేయడం విమర్శలకు దారితీసింది.ఆలయ అధికారుల వైఖరిపై మంత్రుల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube