టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) అమరావతి చేరుకోనున్నారు.ఈ క్రమంలో చంద్రబాబు నివాసంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్,( Gajendrasingh Shekawat ) పురంధేశ్వరితో ( Purandeshwari ) పాటు పలువురు బీజేపీ సీనియర్ నేతలు వెళ్లనున్నారు.
అదేవిధంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, ( Pawan Kalyan ) నాదెండ్ల మనోహార్( Nadendla Manohar ) కూడా చంద్రబాబు నివాసానికి చేరుకోనున్నారు.పొత్తుల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై మూడు పార్టీల నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.
ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయనున్నారు.మరో రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల చివరి జాబితాను విడుదల చేయాలని పార్టీ అధినేతలు భావిస్తున్నారని తెలుస్తోంది.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విపక్ష పార్టీ నేతల సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.