యాదాద్రి భువనగిరి జిల్లా:యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవ వేడుకలను పురస్కరించుకొని రేపు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రానున్నట్లు ఆలయ ఈఓ రామకృష్ణారావు ప్రకటించారు.ఆదివారం గుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈఓ మాట్లాడుతూ మార్చి 11 నుంచి 21 వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
బ్రహ్మోత్సవ వేడుకల ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారని చెప్పారు.