కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయల దోపిడీ..: కోదండరాం

కాళేశ్వరం ప్రాజెక్టుపై టీజేఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని టీజేఎస్ నేత కోదండరాం ఆరోపించారు.

 Robbery Of Crores Of Rupees In The Name Of Kaleshwaram..: Kodandaram-TeluguStop.com

కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుప్పకూల్చారని మండిపడ్డారు.కాళేశ్వరంతో ఉపయోగం లేదని తెలిసినా మాజీ సీఎం కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించడం చాలా కష్టమని చెప్పారు.మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగాయన్న కోదండరాం కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ప్రాజెక్టు అంశంలో ప్రభుత్వంపై భారం తగ్గేందుకు రీ షెడ్యూల్ చేయాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube