YS Sharmila : బీజేపీతో అంటకాగే పార్టీలకు బుద్ధి చెప్పాలి..: షర్మిల

ఏపీలో టీడీపీ -జనసేన( TDP-Jana Sena ) మరియు బీజేపీ పొత్తుపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులను ఎవరూ స్వాగతించడం లేదని చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో పొత్తు ఎందుకని షర్మిల ప్రశ్నించారు.ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు, జగన్ పట్టించుకోలేదన్న వైఎస్ షర్మిల ఏపీకి వెన్నుపోటు పొడిచిన బీజేపీతో( BJP ) పొత్తు ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు.

చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం ఊసరవెల్లిలా రంగులు మార్చారని ఆరోపించారు.బీజేపీకి తొత్తులుగా ఉంటే సీబీఐ, ఈడీ రైడ్స్ ఉండవని విమర్శించారు.

బీజేపీతో అంటకాగే పార్టీలకు ప్రజలు బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

Advertisement
గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత

తాజా వార్తలు