హైదరాబాద్ లోని బషీర్బాగ్లో నిజాం కాలేజీ విద్యార్థులు( Nizam College Students ) ఆందోళనకు దిగారు.హాస్టల్ లో నాసిరకం భోజనం పెడుతున్నారని విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ మేరకు హాస్టల్ ముందు రోడ్డుపై బైఠాయించిన స్టూడెంట్స్ ఆహార పదార్థాలతో ధర్నాకు దిగారు.ఇప్పటికైనా హాస్టల్ లో ( Hostel ) మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల ఆందోళనలతో బషీర్ బాగ్( Basheer Bagh ) ఏరియాలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసన చేస్తున్న విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.







