లోక్ సభ ఎన్నికలు( Loksabha Elections ) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇప్పటికే నాలుగు ఎంపీ స్థానాలకు గులాబీ బాస్ కేసీఆర్( KCR ) అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు.
ఈ మేరకు మహబూబ్ నగర్,( Mahabubnagar ) నాగర్ కర్నూల్( Nagar Kurnool ) పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు.నేతలతో చర్చించిన అనంతరం అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది.అలాగే శాసనమండలి ఉప ఎన్నిక అభ్యర్థులనూ కేసీఆర్ ఫైనల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.