ఏపీలో జగనన్న విద్యాదీవెన ( Jagananna Vidyadevena Scheme ) పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.నిన్న జగనన్న విద్యాదీవెన పథకం కింద రూ.708.68 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు సుమారు 9.44 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేసింది.అయితే ఈ డబ్బులను వారం, పది రోజుల్లో కాలేజీల్లో చెల్లించాలని విద్యార్థులు, వారి తల్లులకు ఏపీ ప్రభుత్వం సూచించింది.పది రోజుల్లో కాలేజీల్లో నగదును చెల్లించకపోతే తదుపరి విడతలో నేరుగా కాలేజీలకే డబ్బులను జమ చేస్తామని సర్కార్ స్పష్టం చేసింది.







