నాగర్ కర్నూలు ఎంపీ పి రాములు( Pothuganti Ramulu ) బీజేపీలో చేరారు.ఈ మేరకు పార్టీ కండువా కప్పి రాములును బీజేపీ అగ్రనేత తరుణ్ చుగ్ పార్టీలోకి ఆహ్వానించారు.
రాములుతో పాటు ఆయన కుమారుడు భరత్( Bharat ) కూడా కాషాయకండువా కప్పుకున్నారు.అనంతరం ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ రాములు పార్టీలో చేరడం బీజేపీకి బలమని చెప్పారు.
చాలా మంది బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో తిరుగులేని శక్తిగా బీజేపీ మారుతోందని తెలిపారు.రాష్ట్రంలో బీఆర్ఎస్( Brs party మునిగిపోయిన పడవని విమర్శించారు.