సూర్యాపేట జిల్లా: సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పిన్న వయసులో శాసనసభ్యురాలిగా ప్రజా మన్ననలతో ఎన్నికయిన ఆమె అర్దాంతరంగా దివంగతులు కావడం శోచనీయమన్నారు.
ఆమె మరణం పట్ల ఆయన సంతాపం ప్రకటిస్తూ శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.