విశాఖపట్నం జిల్లా( Visakhapatnam District )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అదుపుతప్పిన ఓ స్కూల్ బస్సు రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో బస్సు టైర్ల కింద పడి ఓ మహిళ మృత్యువాత పడింది.ఎస్ కోట నుంచి ఆనందపురం వెళ్లే రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది.
వెంటనే గమనించిన స్థానికులు బస్సులో నుంచి స్కూల్ పిల్లలను సురక్షితంగా బయటకు తీశారు.

అనంతరం సమాచారం అందుకున్న అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అయితే బస్సు డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.







