తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో సాగునీటి శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది.శ్వేతపత్రం రిలీజ్ చేసిన తరువాత లఘుచర్చ నిర్వహించనుంది.
గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల్లో అవినీతి బయటపెట్టాలని సర్కారు భావిస్తోంది.లోపాలకు తావు లేకుండా శ్వేతపత్రానికి మెరుగులు పెడుతోందని తెలుస్తోంది.

కాగా దీనిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Minister Uttam Kumar Reddy ) సభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.ఇప్పటికే కాగ్ మరియు ఈడీ ప్రభుత్వానికి కాళేశ్వరం( Kaleshwaram )పై నివేదికలు అందించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కాగ్, ఈడీ నివేదికలను సర్కార్ అస్త్రంగా చేసుకోనుందని సమాచారం.మరోవైపు ప్రభుత్వ ఆరోపణలకు ధీటుగా బదులు ఇచ్చేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా సిద్ధం అవుతోంది.







