Bihar : కాసేపట్లో బీహార్ అసెంబ్లీలో బలపరీక్ష..!

బీహార్( Bihar ) లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.రాష్ట్రంలో ఇటీవల కొలువుదీరిన నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరి కాసేపటిలో బలపరీక్షను ఎదుర్కోనుంది.

 A Test Of Strength In The Bihar Assembly Soon-TeluguStop.com

బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత సభలో సీఎం నితీశ్ కుమార్( CM Nitish Kumar ) బలాన్ని నిరూపించుకోనున్నారు.మహాకూటమి ప్రభుత్వం రద్దు అయిన తరువాత బీహార్ లో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటైన సంగతి తెలిసిందే.

బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా .బలపరీక్ష నెగ్గాలంటే ఎన్డీఏకు 122 ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది.అయితే తమకు 128 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని ఎన్డీఏ కూటమి తెలిపింది.ఇందులో బీజేపీ 78, జేడీయూ 45, హెచ్ఎంఎం 4 మరియు స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు ఉన్నారని ఎన్డీఏ కూటమి చెబుతోంది.

ఈ నేపథ్యంలో బలపరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube