అంగన్వాడి సెంటర్లో పేలిన పప్పు కుక్కర్ ఇద్దరు చిన్నారులకు గాయాలు

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండల( Ananthagiri ) పరిధిలోని శాంతినగర్ అంగన్వాడి కేంద్రంలో సోమవారం పప్పు కుక్కర్ పేలడంతో అభినవ్ (02) హరీష తంసి(02) అనే ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పిల్లలను హుటాహుటిన కోదాడ( Kodad ) ప్రైవేట్ హాస్పటల్ గా తరలించగా డాక్టర్ సలహా మేరకు సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.

 Two Child Were Injured When A Pulse Cooker Exploded At An Anganwadi Center, Anan-TeluguStop.com

తీవ్రంగా గాయపడిన బాబు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ రెయిన్ బో హాస్పటల్ కు తరలించారు.శాంతినగర్ అంగన్వాడి సెంటర్( Anganwadi centre ) లో జరిగిన ఘటనపై విచారణ చేస్తామని సిడిపిఓ పర్వతా తెలిపారు.

కుక్కర్ పేలుడు ఘటనలో గాయపడిన బాబుకు సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ రెయిన్ బో ఆసుపత్రికి తరలించామని,జిల్లా కలెక్టర్ స్పందించి బాబు వైద్యానికి అయ్యే ఖర్చు పెట్టుకుందామన్నారు.అంగన్వాడి టీచర్, ఆయాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube