అల్లం పంటకు( ginger crop ) తీవ్ర నష్టం కలిగించే పుసారియం విల్ట్ శిలీంద్రం( Wilt fungus ) మొక్కల కణజాలంలోకి ప్రవేశించి పోషకాలు మొక్కకు చేరకుండా అడ్డుకుంటుంది.మొక్కల వేరు చివర్ల తగిలిన దెబ్బల ద్వారా ఈ శిలీంద్రం మొక్కలోకి ప్రవేశిస్తుంది.
ఇవి ఒక ప్రాంతంలో ఆవాసం ఏర్పరచుకొని స్థిరపడి, ఎన్నో సంవత్సరాలపాటు జీవిస్తుంది.
అల్లం మొక్కలు క్రమంగా ఆకుపచ్చ రంగు నుంచి పసుపు రంగులోకి మారడం, ఆ తర్వాత వాలిపోవడం జరిగితే ఆ మొక్కకు ఈ శిలీంద్రం ఆశించినట్టే.
పగలు అధిక ఉష్ణోగ్రత ఉంటే ఈ తెగుళ్ల లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి.ఈ తెగుళ్లు ముందు మొక్క మొదలలో కనిపిస్తుంది.ఆ తర్వాత కాండంకు వ్యాపిస్తుంది.

తెగుళ్లు ఆశించిన మొక్కలకు ఎండ తగలకుండా మధ్యాహ్న సమయం ఒక నల్లటి ప్లాస్టిక్ కవర్( Black plastic cover ) తో ఒక నెలపాటు కప్పి ఉంచితే, ఆ శిలీంద్రం చనిపోతుంది.పంట కోతల తర్వాత పంట అవశేషాల్ని పొలం నుంచి తొలగించి వేసవికాలంలో పొలాన్ని లోతు దుక్కులు దున్నాలి.తెగులు నిరోధక రకాలను ఉపయోగించాలి.

ఈ పుసారియం విల్ట్ శిలీంద్రంను నియంత్రించడం కోసం ఎఫ్.ఒక్సిస్పోరం( F.oxysporum ) జీవ నియంత్రణ ఏజెంట్లను ఉపయోగించాలి.నేల యొక్క పీహెచ్ విలువను 6.5 నుంచి 7 మధ్య నియంత్రిస్తే ఈ శిలీంద్రం తీవ్రత తగ్గుతుంది.అల్లం పంట వేసే ముందు మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్( Copper oxychloride ) ను ఒక లీటరు నీటిలో కలిపి నేలను తడపాలి.
ఒక కేజీ విత్తనాలను 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి.పంట పొలాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఈ తెగుల లక్షణాలు కనిపిస్తే వాటిని పీకేస్తే వ్యాప్తి ఎక్కువగా ఉండదు.
ఈ తెగుళ్లు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో నియంత్రించే పద్ధతులు అందుబాటులో లేవు.కాబట్టి ఈ తెగులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పంట సాగు చేయాలి.







