పర్చూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు( TDP MLA Eluri Sambasivarao ) ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.ఈక్రమంలో పిటిషన్ పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ఏడేళ్ల లోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సెక్షన్ 41ఏ నోటీసు( Section 41A Notice ) ఇవ్వాలని కోర్టు పేర్కొంది.నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉంటే అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారని ప్రశ్నించారు.ఒకవేళ అరెస్టు చేస్తే బాధ్యులు పరిణామాలు ఎదుర్కొంటారని హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది.బాధ్యులైన అధికారి అరెస్టుకు ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.