Machilipatnam MP Balashowry : జనసేనలోకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి..!

జనసేన పార్టీ( Janasena Party )లోకి చేరికల పర్వం కొనసాగుతోంది.మచిలీపట్నం ఎంపీ బాలశౌరి( Machilipatnam MP Balashowry ) ఇవాళ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.

 Machilipatnam Mp Balashowry Joins Jana Sena-TeluguStop.com

ఈ మేరకు సాయంత్రం ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్( Pawan Kalyan ) సమక్షంలో బాలశౌరి జనసేనలో చేరనున్నారు.ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది.

మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బాలశౌరి అనుచరులతో పాటు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు మంగళగిరికి ర్యాలీగా తరలిరానున్నారు.

ఈ క్రమంలోనే జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ బండి రామకృష్ణ( Bandi Ramakrishna ) ఆధ్వర్యంలో సుమారు వందకు పైగా కార్లలో జన సైనికులు తరలి వెళ్లనున్నారని సమాచారం.2019లో వైసీపీ నుంచి మచిలీపట్నం ఎంపీగా గెలిచిన బాలశౌరి ఆ పార్టీని వీడి జనసేనలో చేరతానని ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube