జనసేన పార్టీ( Janasena Party )లోకి చేరికల పర్వం కొనసాగుతోంది.మచిలీపట్నం ఎంపీ బాలశౌరి( Machilipatnam MP Balashowry ) ఇవాళ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.
ఈ మేరకు సాయంత్రం ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్( Pawan Kalyan ) సమక్షంలో బాలశౌరి జనసేనలో చేరనున్నారు.ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది.
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బాలశౌరి అనుచరులతో పాటు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు మంగళగిరికి ర్యాలీగా తరలిరానున్నారు.
ఈ క్రమంలోనే జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ బండి రామకృష్ణ( Bandi Ramakrishna ) ఆధ్వర్యంలో సుమారు వందకు పైగా కార్లలో జన సైనికులు తరలి వెళ్లనున్నారని సమాచారం.2019లో వైసీపీ నుంచి మచిలీపట్నం ఎంపీగా గెలిచిన బాలశౌరి ఆ పార్టీని వీడి జనసేనలో చేరతానని ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.