కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని మండిపడ్డారు.
డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇంతవరకు చేయలేదని హరీశ్ రావు విమర్శించారు.రైతుబంధు, నిరుద్యోగ భృతి, రూ.4 వేల పెన్షన్ తో పాటు ఉచిత విద్యుత్ కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు భరోసా ఇచ్చి సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలన్నారు.కేటీఆర్ దావోస్ కు వెళ్తే డబ్బులు దండగా అన్న మీరు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నారని రాహుల్ గాంధీ అంటారన్నారు.కానీ రేవంత్ రెడ్డి వెళ్లి కౌగలించుకుంటారని విమర్శించారు.







