వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆర్టీసీ బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయని తెలుస్తోంది.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కాగా ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో వంద మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం.హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.







