కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.టీడీపీ లేదా జనసేనలో చేరే అవకాశం ఉందని తెలిపారు.
వైసీపీలోకి వెళ్లేందుకు ముద్రగడ ఆసక్తి చూపడం లేదని గిరిబాబు పేర్కొన్నారని తెలుస్తోంది.ఈ క్రమంలో ఇద్దరం పోటీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నామని తెలిపారు.
కాకినాడ పార్లమెంట్, ప్రత్తిపాడు, పిఠాపురంలో పోటీపై ఆసక్తి ఉందని వెల్లడించారు.ఈ క్రమంలోనే అన్నింటికి సిద్ధపడి గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని తెలిపారని సమాచారం.
ప్రస్తుతం గిరిబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.







