ఉమ్మడి కృష్ణా వైసీపీలో ముదురుతున్న సీట్ల మార్పు ముసలం..!!

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని వైసీపీలో సీట్ల మార్పు ముసలం మరింతగా ముదురుతోంది.సీటు మార్పుపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు అలక వహించారని తెలుస్తోంది.

 The Change Of Seats In The Combined Krishna Ycp ..!!-TeluguStop.com

దీంతో మల్లాది విష్ణును పార్టీ పెద్దలు బుజ్జగించే పనిలో పడ్డారు.ఈ మేరకు సజ్జల, అయోధ్య రామిరెడ్డితో పాటు మర్రి రాజశేఖర్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

ఇవాళ సీఎం జగన్ ను మల్లాది విష్ణు కలవనున్నారని తెలుస్తోంది.మరోవైపు విజయవాడ సెంట్రల్ కు మార్చిన వెల్లంపల్లి సైతం జగన్ ను కలిశారు.

మల్లాది విష్ణు సపోర్ట్ లేకుండా ఆ నియోజకవర్గం నుంచి గెలుపు సాధ్యం కాదని వెల్లంపల్లి భావిస్తున్నారు.అలాగే మరో వైసీపీ నేత పార్థసారథి చాలాకాలంగా టీడీపీతో టచ్ లో ఉన్నారని సమాచారం.

ఈనెల 18న కే పార్థసారథి టీడీపీలోకి చేరే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube