ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అభ్యర్థుల ఖరారుపై టీడీపీ, జనసేన పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.ఈ క్రమంలో ఐదు స్థానాలు కావాలని జనసేన పట్టుబడుతుందని తెలుస్తోంది.
కాకినాడ రూరల్, రాజమండ్రి రూరల్, పిఠాపురం, కొత్తపేట మరియు మండపేట స్థానాలు కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అడుగుతున్నారు.అయితే ఈ ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు.
అంతేకాదు ఆ స్థానాలకు జనసేనకు వదిలేస్తే ఇక్కడి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ సీట్లను వదుకోవాల్సి వస్తుందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఇరుపార్టీల అధినేతలు టికెట్ల విషయంపై ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.







