నల్లగొండ జిల్లా: మునుగోడు మండల కేద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గత ఆరు నెలలుగా లైట్స్ వెలగపోవడంతో ప్రధాన చౌరస్తా మొత్తం అంధకారంలో నిండిపోయిందనని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చిట్యాల, చౌటుప్పల్, నల్లగొండ వైపుకు ఈ చౌరస్తా మీదుగా నిత్యం వాహనాల రాకపోకలు సాగిస్తాయని, చీకట్లో వాహనాల రాకపోకలతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్ట్రీట్ లైట్స్ రిపేర్ చేసి చౌరస్తాలో వెలుగులు నింపాలని కోరుతున్నారు.