సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బెదిరింపుల కేసులో అమరావతి జేఏసీ కన్వీనర్ కొలికిపూడి శ్రీనివాస్ రావు సీఐడీ కార్యాలయానికి వచ్చారు.గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు అయ్యారు.
దర్శకుడు ఆర్జీవీని చంపి తలను తీసుకొచ్చిన వారికి రూ.కోటి ఇస్తామంటూ ఓ టీవీ డిబేట్ లో సుఫారీ ప్రకటించారని రామ్ గోపాల్ వర్మ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.ఫిర్యాదు నేపథ్యంలో కేసులో కొలికిపూడి శ్రీనివాస్ కు సీఐడీ 41 ఏ కింద నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
సీఐడీ నోటీసుల మేరకు కొలికపూడి విచారణకు హాజరయ్యారు.







