బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి షాక్ తగిలింది.హైదరాబాద్ లో ఓ ల్యాండ్ కు సంబంధించిన కేసులో ఆయనపై కేసు నమోదు అయిందని తెలుస్తోంది.
ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే కందాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.రోడ్ నంబర్ 3 లో సుమారు 2,185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని ఉపేందర్ రెడ్డితో పాటు ఇతరులు కబ్జా చేసి నిర్మాణాలు చేశారని పలు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో తహశీల్దార్ ఫిర్యాదు మేరకు కందాల ఉపేందర్ రెడ్డితో పాటు ఐపీసీ సెక్షన్లు 447, 427, 467, 468, 471 కింద కేసు నమోదు చేశారు.మరోవైపు ఆ స్థలం తమదేనని కందాల ఉపేందర్ రెడ్డి చెబుతున్నారని తెలుస్తోంది.







