బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, ఆరు గ్యారెంటీలపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాము కొనుగోలు చేసిన కార్లు, ప్రగతిభవన్ ప్రజల ఆస్తి అని తెలిపారు.
దేశంలో ఎవరు వాహనాలు కొనుగోలు చేసినా బుల్లెట్ ప్రూఫ్ గా మార్చేందుకు విజయవాడకు వెళ్తారని హరీశ్ రావు పేర్కొన్నారు.ఆ విషయాన్ని రాజకీయం చేయడం తగదని చెప్పారు.
అలాగే ఆరు గ్యారెంటీలపై ప్రజలకు పలు అనుమానాలు ఉన్నాయన్న హరీశ్ రావు పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే గ్యారెంటీలను ఎలా ఇస్తారని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే ఎన్నికల లోపు ఆరు గ్యారెంటీల విధివిధానాలను ప్రకటించాలన్నారు.
అంతేకాకుండా రాష్ట్రంలో ప్రోటోకాల్ ఘోరంగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.







