ఏపీ మున్సిపల్ కార్మికులతో అసంపూర్తిగా ముగిసిన ప్రభుత్వ చర్చలు..

ఏపీ ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికుల చర్చలు అసంపూర్తిగా ముగిశాయని తెలుస్తోంది.మంత్రి ఆదిమూలపు సురేశ్ తో సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు కొనసాగాయి.

 Government Talks With Ap Municipal Workers Ended Inconclusively..-TeluguStop.com

చర్చల్లో మున్సిపల్ కార్మికుల ప్రధాన డిమాండ్లపై మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టమైన హామీ ఇవ్వలేదని తెలుస్తోంది.ఈ క్రమంలో కార్మికులు సమ్మెను విరమించాలని మంత్రి ఆదిమూలపు కోరారు.

అయితే ప్రభుత్వం తరపు నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు సమ్మెను విరమించేది లేదని, సమ్మె కొనసాగుతుందని మున్సిపల్ కార్మికులు చెబుతున్నట్లు సమాచారం.అయితే గత మూడు రోజులుగా ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.కనీస వేతనం రూ.26 వేలు అందించడంతో పాటు ఫీల్డులో పని చేసే కార్మికులకు రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని అదేవిధంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube