స్టిక్కర్ ప్రభుత్వంగా వైసీపీ సర్కార్..: పురంధేశ్వరి

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వైసీపీ సర్కార్ స్టిక్కర్ ప్రభుత్వంగా మారిందని విమర్శించారు.

 Ycp Government As A Sticker Government..: Purandheswari-TeluguStop.com

కేంద్ర పథకాలకు జగన్ తన ఫొటో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని పురంధేశ్వరి ఆరోపించారు.కేంద్రం అందిస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలని చెబుతున్నారని మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.385 కోట్లు ఇవ్వకపోవడం వలనే కోటిపల్లి – నరసాపురం రైల్వేలైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు.అయితే రైల్వేలైన్ కు కేంద్రం రూ.1100 కోట్లు మంజూరు చేసిందని ఆమె తెలిపారు.అలాగే జనసేనతో బీజేపీ పొత్తులో ఉందన్న పురంధేశ్వరి టీడీపీతో పొత్తు అంశంపై పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube