స్టిక్కర్ ప్రభుత్వంగా వైసీపీ సర్కార్..: పురంధేశ్వరి

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వైసీపీ సర్కార్ స్టిక్కర్ ప్రభుత్వంగా మారిందని విమర్శించారు.

కేంద్ర పథకాలకు జగన్ తన ఫొటో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని పురంధేశ్వరి ఆరోపించారు.

కేంద్రం అందిస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలని చెబుతున్నారని మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.

385 కోట్లు ఇవ్వకపోవడం వలనే కోటిపల్లి - నరసాపురం రైల్వేలైన్ పనులు నత్తనడకన సాగుతున్నాయని పేర్కొన్నారు.

అయితే రైల్వేలైన్ కు కేంద్రం రూ.1100 కోట్లు మంజూరు చేసిందని ఆమె తెలిపారు.

అలాగే జనసేనతో బీజేపీ పొత్తులో ఉందన్న పురంధేశ్వరి టీడీపీతో పొత్తు అంశంపై పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు.

పవన్‌ని నమ్ముకుని కెరీర్‌ని రిస్క్‌లో పెట్టిన టాప్ డైరెక్టర్లు.. ఎవరంటే.. ?